దుబాయ్:ఇండియన్ కాన్పులేట్ లో దివాళి వేడుకలు..మతసామరస్యం వెల్లివిరిసేలా వేడుక
- November 13, 2020
దుబాయ్:భిన్నత్వంలో ఏకత్వం. ఇదే భారతీయతకు ఆత్మ. విభన్న సంస్కృతులు, మతాలు, భాషలు ఉన్నా..అంతా ఒక్కటిగా బతకటమే భారతదేశ ఔనత్యం. ఈ ఔనత్యానికి వేదికగా నిలిచింది దుబాయ్ లోని భారత దౌత్యకార్యాలయం.దివాళి వేడుకలను సర్వమత సమ్మేళనంగా అహ్లాదకర వాతావరణంలో నిర్వహించింది. కోవిడ్ మహమ్మారి వెంటాడుతున్న సమయంలోనూ అన్ని మతాల వారు కలిసి దివాళి వేడుకల్లో పాల్గొన్నారు. అబుధాబి హిందూ టెంపుల్ BAPS స్వామి బ్రహ్మవిహారిదాస్, యూఏఈ బోహ్రా సమాజిక వర్గ ప్రతినిధిగా మొహమ్మద్ ఖోముసి, మర్ తోమా చర్చి నుంచి రెవరెండ్ సిజు చెరియన్ ఫిలిప్, గురుద్వారా నుంచి సురేందర్ సింగ్ ఖందారి, జైన్ కమ్యూనిటి నుంచి చందు సిరోయా దివాళి వేడుకల్లో పాలుపంచుకున్నారు. వేడుకకు ముఖ్యఅతిథిగా హజరైన ఒమర్ అల్ ముతన్నా మాట్లాడుతూ..యూఏఈ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయిన భారత సమాజం కృషిని ప్రశంసించారు. అనంతరం దుబాయ్ లోని భారత కౌన్సిల్ జనరల్ డాక్టర్ అమన్ పురి మాట్లాడుతూ..యూఏఈలోని భారతీయులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు.




తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







