DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- January 18, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) టెర్మినల్ 1 కి వెళ్ళే బ్రిడ్జిని విస్తరించనున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. బ్రిడ్జి విస్తరణతో ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్రాఫిక్ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపింది.
ఈ విస్తరణ ప్రాజెక్ట్లో ట్రాఫిక్ లేన్ల సంఖ్యను మూడు నుండి నాలుగుకు పెరగనుంది. బ్రిడ్జి సామర్థ్యం గంటకు 4,200 వాహనాల నుండి గంటకు 5,600 వాహనాలకు పెరుగుతుంది. మొత్తంగా బ్రిడ్జి సామర్థ్యం 33 శాతం మెరుగు పడుతుందని ఆర్టీఏ వెల్లడించింది.
దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (DAEP) భాగస్వామ్యంతో చేసిన ఈ ప్రాజెక్ట్లో రోడ్డుకు ఇరువైపుల మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయనున్నారు. ల్యాండ్స్కేపింగ్ పనులను కూడా చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







