అరవై ఏళ్లు దాటిన ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లాల్సిందే..కువైట్ కొత్త పాలసీ
- November 15, 2020కువైట్ సిటీ:60 ఏళ్లు అంతకుమించి వయసున్న ప్రవాసీ కార్మికులకు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల వయసు పైబడి.. హైస్కూల్ సర్టిఫికెట్ తో కువైట్ లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రవాసీయులకు ఇకపై రెసిడెన్సీ పర్మిట్ ను రెన్యూవల్ చేయబోయేది లేదని కువైట్ మానవ వనరుల ప్రజా అధికార విభాగం ప్రకటించింది. దీనికి సంబంధించి పరిపాలన పరమైన నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది. హై స్కూల్ సర్టిఫికెట్ బేస్ తో కువైట్ లో పని చేస్తున్న ప్రవాసీయులు(60 ఏళ్లకుపైబడినవాళ్లు)..జనవరి 1లోగా ఇక దేశం విడిచి వెళ్లిపోవటం ఉత్తమమని సూచించింది. నూతన పరిపాలన విధానం అమల్లోకి వచ్చే జనవరి 1 నాటికి దేశంలోని వృద్ధ ప్రవాసీయుల నివాస అనుమతులు ఆటోమెటిగ్గా రద్దు అవుతాయని, అప్పటికే గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి మళ్లీ రెన్యూవల్ చేయబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA