అరవై ఏళ్లు దాటిన ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లాల్సిందే..కువైట్ కొత్త పాలసీ
- November 15, 2020
కువైట్ సిటీ:60 ఏళ్లు అంతకుమించి వయసున్న ప్రవాసీ కార్మికులకు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల వయసు పైబడి.. హైస్కూల్ సర్టిఫికెట్ తో కువైట్ లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రవాసీయులకు ఇకపై రెసిడెన్సీ పర్మిట్ ను రెన్యూవల్ చేయబోయేది లేదని కువైట్ మానవ వనరుల ప్రజా అధికార విభాగం ప్రకటించింది. దీనికి సంబంధించి పరిపాలన పరమైన నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది. హై స్కూల్ సర్టిఫికెట్ బేస్ తో కువైట్ లో పని చేస్తున్న ప్రవాసీయులు(60 ఏళ్లకుపైబడినవాళ్లు)..జనవరి 1లోగా ఇక దేశం విడిచి వెళ్లిపోవటం ఉత్తమమని సూచించింది. నూతన పరిపాలన విధానం అమల్లోకి వచ్చే జనవరి 1 నాటికి దేశంలోని వృద్ధ ప్రవాసీయుల నివాస అనుమతులు ఆటోమెటిగ్గా రద్దు అవుతాయని, అప్పటికే గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి మళ్లీ రెన్యూవల్ చేయబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







