అరవై ఏళ్లు దాటిన ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లాల్సిందే..కువైట్ కొత్త పాలసీ
- November 15, 2020
కువైట్ సిటీ:60 ఏళ్లు అంతకుమించి వయసున్న ప్రవాసీ కార్మికులకు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల వయసు పైబడి.. హైస్కూల్ సర్టిఫికెట్ తో కువైట్ లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రవాసీయులకు ఇకపై రెసిడెన్సీ పర్మిట్ ను రెన్యూవల్ చేయబోయేది లేదని కువైట్ మానవ వనరుల ప్రజా అధికార విభాగం ప్రకటించింది. దీనికి సంబంధించి పరిపాలన పరమైన నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది. హై స్కూల్ సర్టిఫికెట్ బేస్ తో కువైట్ లో పని చేస్తున్న ప్రవాసీయులు(60 ఏళ్లకుపైబడినవాళ్లు)..జనవరి 1లోగా ఇక దేశం విడిచి వెళ్లిపోవటం ఉత్తమమని సూచించింది. నూతన పరిపాలన విధానం అమల్లోకి వచ్చే జనవరి 1 నాటికి దేశంలోని వృద్ధ ప్రవాసీయుల నివాస అనుమతులు ఆటోమెటిగ్గా రద్దు అవుతాయని, అప్పటికే గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి మళ్లీ రెన్యూవల్ చేయబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







