కేదార్నాథ్లో చిక్కుకుపోయిన ముఖ్యమంత్రులు..
- November 16, 2020
కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేయక ముందే అక్కడ విపరీతంగా మంచు కురవడం ప్రారంభమయ్యింది. దీంతో కేదార్నాథ్ ఆలయ ప్రాంతమంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారిపోయింది. చలి విపరీతంగా పెరిగిపోయింది. ఇదేవిధంగా గంగోత్రిథామ్లోనూ భారీగా మంచు కురుస్తోంది. గంగోత్రిథామ్ తలుపులను మూసిన వెంటనే ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. గంగాఘాటీ తీరమంతా మంచుతో నిండిపోయింది.
కేదార్నాథ్ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడే చిక్కకుపోయారు. ముఖ్యమంత్రులిద్దరూ హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం కావాల్సివుంది. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిపివేశారు. దీంతో వాతావరణం సాధారణ స్థితికి వచ్చేవరకూ హెలికాప్టర్ సేవలు కొనసాగించే అవకాశం లేదు. ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లలో విపరీతంగా మంచు కురుస్తోంది.
हर हर महादेव... pic.twitter.com/sYp1PRY4I1
— Yogi Adityanath (@myogiadityanath) November 16, 2020
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









