17 మిలియన్ రియాల్స్ మోసం కేసులో ఐదుగురి అరెస్ట్
- November 16, 2020
రియాద్:సౌదీ అరేబియా సెక్యూరిటీ అథారిటీస్ ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 17 మిలియన్ రియాల్స్ కమర్షియల్ స్కాంలో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అనుమానితుల్లో ఇద్దరు సిరియా వలసదారులున్నారు. రియాద్ పోలీస్ సహాయ అధికార ప్రతినిది¸ మేజర్ ఖాలిద్ అల్ క్రీడిస్ మాట్లాడుతూ, న్యాయ సంబంధ శాఖల ప్రతినిథులుగా నమ్మించి, ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీల నుంచి డిస్ట్రెస్డ్ డెబిట్స్ని నిందితులు రికవర్ చేస్తున్నట్లుగా నటిస్తూ, పలువుర్ని మోసం చేసినట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిందితులు పలు ప్రకటనలు ఇచ్చి ఆయా వ్యక్తుల్ని మోసం చేశారు. బ్యాంకు అకౌంట్ వివరాల్ని సేకరించి, డబ్బుల్ని కొట్టేశారు నిందితులు. సుమారు 17 మిలియన్ రియాల్స్ మోసం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







