17 మిలియన్ రియాల్స్ మోసం కేసులో ఐదుగురి అరెస్ట్
- November 16, 2020
రియాద్:సౌదీ అరేబియా సెక్యూరిటీ అథారిటీస్ ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 17 మిలియన్ రియాల్స్ కమర్షియల్ స్కాంలో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అనుమానితుల్లో ఇద్దరు సిరియా వలసదారులున్నారు. రియాద్ పోలీస్ సహాయ అధికార ప్రతినిది¸ మేజర్ ఖాలిద్ అల్ క్రీడిస్ మాట్లాడుతూ, న్యాయ సంబంధ శాఖల ప్రతినిథులుగా నమ్మించి, ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీల నుంచి డిస్ట్రెస్డ్ డెబిట్స్ని నిందితులు రికవర్ చేస్తున్నట్లుగా నటిస్తూ, పలువుర్ని మోసం చేసినట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిందితులు పలు ప్రకటనలు ఇచ్చి ఆయా వ్యక్తుల్ని మోసం చేశారు. బ్యాంకు అకౌంట్ వివరాల్ని సేకరించి, డబ్బుల్ని కొట్టేశారు నిందితులు. సుమారు 17 మిలియన్ రియాల్స్ మోసం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









