షిర్డీ సాయి బాబా ఆలయం పునఃప్రారంభం
- November 16, 2020
ముంబై:మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా దేవస్థానంతో పాటు పలు ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్ మహమ్మారి మధ్య భక్తులు ఆలయాలను సందర్శించేందుకు ప్రభుత్వం స్టాండర్స్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ జారీ చేసింది. ఆలయాల్లో సామాజిక దూరం, ఫేస్ మాస్క్లు ధరించడం తప్పసరి సరి చేశారు. షిర్డీ దేవస్థానం ట్రస్ట్ నిత్యం ఆరువేల మందికిపైగా భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. కౌంటర్లతో పాటు ఆన్లైన్లో టికెట్లు జారీ చేస్తున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం, పూణేలోని దాద్గుషెత్ హల్వాయి గణపతి ఆలయంలో సైతం భక్తులకు అనుమతి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చిలో ఆలయాలు మూతపడ్డాయి. కేవలం ఆయా ఆలయాల్లో నిత్య పూజలు జరగ్గా.. భక్తులకు అనుమతి ఇవ్వలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆలయాల్లో భక్తులకు అనుమతి ఇచ్చారు. జూన్లో కేంద్రం ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వగా.. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూసే ఉంచింది.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









