మొక్కజొన్న పాయసం
- February 17, 2016
కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు - అరకప్పు పనీర్ (చిన్నముక్కలు) - అరకప్పు పాలు - అరలీటరు, పాలపొడి - 6 టేబుల్ స్పూన్లు, పిస్తా
పలుకులు-8, బాదం పలుకులు -10, రోజ్వాటర్ - టీ స్పూను, యాలకుల పొడి - అరస్పూను, పంచదార - టేబుల్స్పూను, కుంకుమపువ్వు - కొద్దిగా.
తయారుచేసే విధానం
ముందుగా కుంకుమపూవుని రోజ్వాటర్లో, పిస్తా, బాదం పప్పుల్ని వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి ఉంచాలి. పిస్తా బాదంలను నీటిలోంచి తీసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలను కాగబెట్టి, అందులో మొక్కజొన్న గింజల్ని, పనీరు ముక్కల్ని వేసి, చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి ఆపై పాలపొడిని వేస్తూ ఉండలు చుట్టకుండా కలపాలి. పాలు చిక్కబడ్డాక పంచదారను వేసి, అది కరుగుతున్నపడు కుంకుమపూవును కూడా వేసి దించాలి. తరిగి ఉంచుకున్న బాదం, పిస్తా ముక్కల్ని, యాలకుల పొడిని పైన చల్లాలి. పాయసం గది ఉష్ణోగ్రతలోకి వచ్చేక ఫ్రిజ్లో ఉంచి చల్లచల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









