సంచయితపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతిరాజు..
- November 17, 2020
గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్నాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ బాధ్యతలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాల బాధ్యతను కూడా ఏపీ ప్రభుత్వం సంచయితకు అప్పగించడంపై అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్టుపై ఆయన ధ్వజమెత్తారు.
‘చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్ట్ చేశారు. మీరు చేస్తున్న పోస్టులు.. మీ వ్యవహారశైలికి అడ్డం పడుతున్నాయి. ఎవరో పెట్టిన పోస్టులకు తాను సమాధానం చెప్పాల్సి రావడం తన ఖర్మ’ అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
మాన్నాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి ఆనవాయితీగా వచ్చేది. అలాకాదని కోర్టు తీర్పులకు, ఆనవాయితీలకు విరుధ్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇష్టమొచ్చిన వారిని కుటుంబసభ్యులని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తండ్రి, తాతను కూడా ఎప్పడూ సంచయిత కలవలేదని అశోక్ గజపతి రాజు దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









