ఉగ్రవాది హఫీజ్ సయీద్కు పదేళ్ల జైలుశిక్ష..
- November 19, 2020
2008, సెప్టెంబర్ 11న ముంబైలో జరిగిన దాడుల సూత్రధారి, పాకిస్థాన్ ఉగ్రవాది హఫజీ సయిద్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. రెండు ఉగ్రవాద కేసుల్లో అతనికి ఈ శిక్షను పాకిస్థాన్ కోర్టు ఇవాళ ఖరారు చేసింది. జమాత్ ఉల్ దవా చీఫ్కు పాక్ కోర్టు శిక్షను ఖరారు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్కు గత ఫిబ్రవరిలో కూడా పాక్ కోర్టు శిక్షను వేసింది. ఓ టెర్రర్ ఫండింగ్ కేసులో అతనికి 11 ఏళ్ల శిక్షను వేశారు. హఫీజ్ను గ్లోబల్ ఉగ్రవాదిగా అమెరికాతో పాటు యూఎన్ గుర్తించాయి. గత ఏడాది జూలైలో అంతర్జాతీయ వత్తిళ్ల కారణంగా.. టెర్రర్ ఫండింగ్ కేసులో పాక్ అతన్ని అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









