700 మందికి పైగా వాహనదారుల బ్లాక్ పాయింట్స్ రద్దు, తిరిగి లైసెన్సులు
- November 20, 2020
అబుధాబి:మొత్తంగా 764 మంది డ్రైవర్లకు సంబంధించిన లైసెన్సులు గడచిన తొమ్మిది నెలల్లో పునరుద్ధరింపబడ్డాయి. వీరి ఖాతాల్లోంచి బ్లాక్ పాయింట్స్ రద్దు చేయబడ్డాయి. అబుదాబీ పోలీస్ - పోలీస్ మానిటరింగ్ అండ్ కమ్యూనిటీ సెక్యూరిటీ కేర్ - డైరెక్టర్ కల్నల్ డాక్టర్ మొహమ్మద్ అహ్మద్ అల్ బురైకి వెల్లడించిన వివరాల ప్రకారం, డ్రైవర్ల భద్రత పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నామనీ, ఈ క్రమంలో వాహనదారులకు భద్రతతో కూడిన డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నామనీ, సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 23 కంటే తక్కువ బ్లాక్ పాయింట్స్ కలిగిన డ్రవర్లు, ఏడాదిలో ఓసారి ట్రెయినింగ్ ప్రోగ్రాంకి హాజరవ్వాల్సి వుంటుంది. ఈ ప్రోగ్రాంలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తారు. వీరి నుంచి 8 ట్రాఫిక్ పాయింట్స్ని తగ్గించడం జరుగుతుంది. కాగా, 24 ట్రాఫిక్ పాయింట్స్ కలిగిన డ్రైవర్లు, తమ లైసెన్సుని మూడు నెలల పాటు తాత్కాలికంగా కోల్పోవాల్సి వస్తుంది. అయితే, ట్రెయినింగ్ కోర్సులో పాస్ అయితే, వీరికి ఉపశమనం కల్పిస్తుంది. ఆయా డ్రైవర్లకు వారి మాతృ భాషల్లో ఈ ట్రెయినింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







