మోడిఫై చేసిన 27 కార్లను సీజ్ చేసిన దుబాయ్ పోలీసులు
- November 21, 2020
దుబాయ్:కార్లను ఇష్టానుసారంగా మోడిఫై చేసిన 27 కార్లను దుబాయ్ పోలీసులు సీజ్ చేశారు. కంపెనీ నుంచి వచ్చిన ఇంజిన్ ను...సరైన ప్రయాణాలు పాటించకుండా మోడీఫై చేయటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని పోలీసులు హెచ్చరించారు. సీఐడీ సాయంతో నిర్వహించిన డ్రైవ్ లో ఇంజిన్లను మోడిఫై చేసి కార్ స్పీడును పెంచినట్లు గుర్తించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఓ ప్రామాణికతకు లోబడి కంపెనీలు ఆయా కార్ల మోడళ్లకు తగ్గట్లుగా ఇంజిన్ను డిజైన్ చేస్తాయని, అవి ఎంత స్పీడుగా వెళ్లాలో శాస్త్రీయంగా నిర్ధారిస్తాయని వివరించారు. కానీ, కొందరు కంపెనీ ప్రమాణాలతో ఇంజిన్లను తమకు తోచినట్లు మార్చుకుంటున్నారని, డబుల్ బూస్టర్లు వేయించి 200 గరిష్ట వేగంతో వెళ్లగలిగేందుకు మాత్రమే అనువుగా ఉండే కార్ల వేగాన్ని 400 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకునేలా మార్చుకుంటున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకరమని శక్తిమించి స్పీడు సామర్ధ్యాన్ని పెంచుకోవటం ద్వారా కారును కంట్రోల్ చేయటం సాధ్యం కాదనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మోడీఫై కార్లతో ఒక్క డ్రైవర్ కారణంగా రోడ్డు మీద ఇతర వాహనదారులకు, పాదచారులకు ముప్పు ఏర్పడుతోందని...వీటిని సహించబోమన్నారు. ఎవరైనా కార్లను మోడీఫై చేసినట్లు గుర్తిస్తే Dh1,000 జరిమానాతో పాటు 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే వాహనాన్ని 30 రోజుల పాటు సీజ్ చేస్తామన్నారు. తీవ్రతను బట్టి ఫైన్ పెరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









