హద్దు దాటిన కాంట్రాక్టర్లు, కంపెనీలకు కువైట్ షాక్..
- November 21, 2020
కువైట్ సిటీ:నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లకు, కంపెనీలకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. వివిధ పనులు, ప్రాజెక్టుల కోసం ఆయా కాంట్రాక్టర్లు, కంపెనీలు ప్రభుత్వం దగ్గర గ్యారెంటీగా పెట్టిన దాదాపు 90 మిలియన్ల కువైట్ దినార్లను పూర్తిగా స్వాధీనం చేసుకొని వాటిని ఎన్ క్యాష్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ కాంట్రాక్టర్లు, కంపెనీలకు తమ మంత్రిత్వ శాఖ నుంచి పేమెంట్లు వెళ్లాల్సి ఉంటే....గ్యారంటీలను ఎన్ క్యాష్ చేసుకునే బదులు ఆ బకాయిల చెల్లింపుల్లో కోత విధించనున్నట్లు పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రి స్పష్టం చేసింది. గత ఆర్ధిక సంవత్సరంలో పబ్లిక్ వర్క్స్ పరిధిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్లు, పలు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టిన కంపెనీలు...తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవటంతో గతంలోనే పలు మార్లు నోటీసులు పంపించింది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఇప్పుడు ఆయా కాంట్రాక్టర్లు, కంపెనీలకు చెందిన 90 మిలియన్ల దినార్లను ఎన్ క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే..2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను రూపొందించే పనిలో ఉంది కువైట్ ప్రభుత్వం. కేవలం మినిస్ట్రి ఆధ్వర్యంలో చేపట్టే పలు ప్రాజెక్టులకు దాదాపు బిలియన్ దినార్లను కేటాయించేలా కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









