సౌదీలో కోవిడ్ 19 ట్రేసింగ్ యాప్...ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు
- November 21, 2020
రియాద్:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సౌదీ ప్రభుత్వం..కరోనా సోకిన వారిని గుర్తించేందుకు, వారితో కాంట్రాక్ట్ లో ఉండేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్ 19 కాంట్రాక్ట్-ట్రేసింగ్ యాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన మూడో దేశంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను సాంకేతిక సేవలతో అధిగమించటం అనివార్యమంటూ సౌదీ డేటా& ఏఐ(SDAIA) ప్రెసిడెంట్ డాక్టర్ అబ్ధుల్లా బిన్ షరీఫ్ అల్ గంమ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ శ్రేణి మొబైల్ కంపెనీల నుంచి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కింగ్డమ్ లోని అధునాతన సాంకేతిక పరిజ్నానం ఎప్పుడు ముందు వరుసలో ఉండటం గర్వించాల్సిన విషయమని ఆయన ప్రశంసించారు. ఈ నెల 20 నుంచి 22 వరకు సౌదీ వేదికగా నిర్వహించే జీ20 సదస్సు కోసం జరిగిన సన్నాహాక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్ధతపు అవకాశాలను సమర్ధవంతంగా అందరూ అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను అధిగమించటంతో పాటు భవిష్యత్తులోనూ సాంకేతికతకు ఆవశ్యతను ఎవరూ తోసిపుచ్చలేరని ఆయన అన్నారు. డిజిటల్ ఎకనామీ, టెక్నాలజీ ఇప్పుడైనా, ఎనాడైనా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









