డ్రగ్ ట్రాఫికింగ్: బహ్రెయినీ మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష
- November 21, 2020
మనామా:బహ్రెయినీ న్యాయస్థానం, ఓ బహ్రెయినీ మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. ఆమెకు 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళితే, మహిళపై డ్రగ్స్ అభియోగాలు మోపబడ్డాయి. పోలీసులు జరిపిన సోదాల్లో నిందితురాలి ఇంటి నుంచి 100 గ్రాముల సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ని స్వాధీనం చేసుకున్నారు. పెథాంఫెటమైన్ అలాగే డయాజెపాంలను నిందితురాలు తన దగ్గర వుంచుకోవడంతోపాటు, వాటిని వాడుతున్నట్లు కూడా గుర్తించారు అధికారులు. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, పక్కా సమాచారంతో నిందితురాల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహిళా అధికారులు, నిందితురాల్ని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. క్రిస్టల్ సబ్స్టాన్స్ వున్న ఓ బ్యాగుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









