డ్రగ్ ట్రాఫికింగ్: బహ్రెయినీ మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష
- November 21, 2020
మనామా:బహ్రెయినీ న్యాయస్థానం, ఓ బహ్రెయినీ మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. ఆమెకు 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళితే, మహిళపై డ్రగ్స్ అభియోగాలు మోపబడ్డాయి. పోలీసులు జరిపిన సోదాల్లో నిందితురాలి ఇంటి నుంచి 100 గ్రాముల సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ని స్వాధీనం చేసుకున్నారు. పెథాంఫెటమైన్ అలాగే డయాజెపాంలను నిందితురాలు తన దగ్గర వుంచుకోవడంతోపాటు, వాటిని వాడుతున్నట్లు కూడా గుర్తించారు అధికారులు. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, పక్కా సమాచారంతో నిందితురాల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహిళా అధికారులు, నిందితురాల్ని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. క్రిస్టల్ సబ్స్టాన్స్ వున్న ఓ బ్యాగుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు