రక్తదానం చేసే వారు సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలని డీబీబీఎస్ వినతి

- November 22, 2020 , by Maagulf
రక్తదానం చేసే వారు సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలని డీబీబీఎస్ వినతి

మస్కట్: రక్తదానం చేసే వాళ్లు బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీస్ డిపార్ట్మెంట్-డీబీబీఎస్ సూచించింది. ఈ వారం రోజుల్లో తాము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను నిర్వహించలేమని డీబీబీఎస్ స్పష్టం చేసింది. అయితే..రక్తదానం చేయాలనుకునే వారు డీబీబీఎస్ కు ప్రత్యామ్నాయంగా బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కేంద్రాలను సంప్రదించాలని డీబీబీఎస్ సూచించింది. తమకు 100 నుంచి 120 వరకు బ్లడ్ యూనిట్స్ అవసరం అవుతానయని కూడా వివరించింది. రక్తదానం చేయాలని అనుకునే వాళ్లు 94555648 నెంబర్ కు తమ వివరాలను వాట్సాప్ చేయాలని కోరింది. వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న రక్తదాతలు తమ పూర్తి పేరు, రక్తదానం చేసే రోజు, సమయం వంటి వివరాలతో పాటు సివిల్ ఐడీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే దాతలు ప్లాస్మా దాతలా, ప్లేలెట్స్ దాతలా, రక్తదాతలా అనే వివిరాలు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com