కువైట్ కు తిరిగివచ్చే డొమస్టిక్ వర్కర్స్ ఎయిర్ ఫేర్స్ ను 350 KDగా నిర్ణయం

- November 22, 2020 , by Maagulf
కువైట్ కు తిరిగివచ్చే డొమస్టిక్ వర్కర్స్ ఎయిర్ ఫేర్స్ ను 350 KDగా నిర్ణయం

లాక్ డౌన్ తో కువైట్ బ్యాన్డ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్స్ కు శుభవార్త. భారత్ తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పిలిప్పైన్స్ నుంచి కువైట్ రావాలనుకునే డొమస్టిక్ వర్కర్స్ కు సంబంధించి ఎయిర్ వేర్స్ ను డిసైడ్ చేసింది కువైట్ ప్రభుత్వం. భారత్ నుంచి వచ్చే వారికి 110 దినార్లు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి 145 దినార్లు, పిలిప్పైన్స్ నుంచి వచ్చే వారికి 200 దినార్ల చొప్పున విమాన చార్జీలను నిర్ణయించింది. ఈ ఐదు దేశాల నుంచి కువైట్ చేరుకునే ప్రయాణికులకు గరిష్టంగా 350 దినార్లు ఉంటుందని వెల్లండించింది. అదే సమయంలో ఒక రోజుకు 600 సీట్లను మాత్రమే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఆంక్షల సడలింపుల తర్వాత దాదాపు 80 వేల మంది డొమస్టిక్ వర్కర్లు కువైట్ చేరుకుంటారని ఆ దేశ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com