సుశీలమ్మకు శతమానంభవతి
- November 22, 2020
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ సినీ నేపథ్య గాయని, గిన్నిస్ రికార్డు విజేత పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి.సుశీల పాడిన తెలుగు సినీగీతాలలోని 100 ఆణిముత్యాలవంటి పాటలతో "గానకోకిల పాటకు పట్టాభిషేకం" అనే కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా 21వ తేదీ 10 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించారు.
ప్రముఖ నటీమణి ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు చేతులమీదుగా ప్రారంభింపబడిన ఈ కార్యక్రమంలో భారత్ సింగపూర్ అమెరికా దేశాల నుండి 12 మంది ప్రముఖ గాయనీమణులు సుశీల పాటలను ఆలపించి అలరించగా, ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరి కోటి, మాధవపెద్ది సురేష్, మరియు స్వర వీణాపాణి వంటి ప్రముఖులు అతిథులుగా విచ్చేసి సుశీల పాటలను గురించి ఆమెతో వారి అనుబంధాన్ని గురించి తెలియజేస్తూ ప్రసంగించారు.
రాధిక మంగిపూడి వ్యాఖ్యాననిర్వహణలో జరిగిన ఈ అద్వితీయ సంగీత మహోత్సవ కార్యక్రమంలో రాధిక నోరి (అమెరికా), విజయలక్ష్మి భువనగిరి, సురేఖ మూర్తి దివాకర్ల, వేదాల శశికళ స్వామి, శారదా రెడ్డి, శివశంకరి గీతాంజలి, శారద సాయి, శ్రీదేవి, రావూరి మాధవి, హిమబిందు, శైలజా చిలుకూరి (సింగపూర్), సౌభాగ్యలక్ష్మీ (సింగపూర్) 12 మంది సుమధుర గాయనీమణులు 100 పాటలను ఆలపించారు.
కార్యక్రమ ముఖ్య నిర్వాహకులుగా వంశీ ఇంటర్నేషనల్ మరియు సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ట్రస్ట్ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ వ్యవస్థాపకఅధ్యక్షులు కవుటూరు రత్నకుమార్,ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపకఅధ్యక్షురాలు రాధిక మంగిపూడి మరియు శారదా కళాసమితి అధ్యక్షులు దోగిపర్తి శంకర్రావు వ్యవహరించి సుశీలకి వారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలలనుండి వేలాది సినీ సంగీత ప్రేమికులు, సుశీల అభిమానులు అందరూ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరిగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి వీనులవిందైన పాటలను ఆస్వాదించారు.
కార్యక్రమం ఆసాంతం ఈ క్రింది యూట్యూబ్ వీడియోలో చూడవచ్చును
https://fb.watch/1VX8U5F_f6/
https://fb.watch/1VXam9ZmJ_/


తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









