భారత్తో మరింత మెరుగైన సంబంధాల కోసం బహ్రెయిన్ యత్నం
- November 25, 2020
మనామా:భారతదేశంతో ద్వైపాక్షిక బంధం మరింత అద్భుతంగా వుండేందుకోసం బహ్రెయిన్ ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయని ఫారిన్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్తో భేటీ సందర్భంగా అల్ జయానీ ఈ వ్యాఖ్యలు చేశారు. పరస్పర గౌరవం, సహకారంతో ఇరు దేశాలూ స్నేహభావంతో ముందడుగు వేస్తున్నాయనీ, ఆయా విభాగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయని డాక్టర్ అల్ జయాని చెప్పారు. కింగ్డమ్లో భారత కమ్యూనిటీ పాత్రని కొనియాడారాయన. మినిస్టర్ జై శంకర్, ఇటీవల మృతి చెందిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాకి నివాళులర్పించారు. భారత్తో సన్నిహిత సంబంధాల విషయంలో బహ్రెయిన్ నాయకత్వం చేస్తున్న కృషిని కొనియాడారు జై శంకర్.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం







