కంపెనీ పీఆర్వోల ద్వారా పాస్పోర్ట్ అప్లికేషన్లను స్వీకరిస్తున్న ఇండియన్ ఎంబసీ
- November 25, 2020
అబుధాబి లోని ఇండియన్ ఎంబసీ, దరఖాస్తుదారులు లేకుండానే, ఆయా కంపెనీల పీఆర్వోల ద్వారా పాస్పోర్ట్ అప్లికేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ మేరకు ఎంబసీ ఓ ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సీనియర్ మేనేజ్మెంట్, డైరెక్టర్స్ అలాగే సీఈఓలు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్లను తమ పీఆర్వోల ద్వారా సమీపంలోని బిఎల్ఎస్ సెంటర్, ఎంబసీలో అందించవచ్చు. అంతకు ముందు దరఖాస్తుదారులు, తమ పేపర్స్ని స్వయంగా అందించాలని ఎంబసీ కోరడం జరిగింది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ విధానంలో మార్పులు చేశారు. ఈ విధానం ద్వారా అప్లికేషన్లను సమర్పించే దరఖాస్తుదారులకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా పొందుపరిచారు. ఎంప్లాయర్ లేదా కంపెనీ ఓ లెటర్ని ఎంబసీకి రాయాల్సి వుంటుంది సదరు పీఆర్వో విషయమై. ఉద్యోగి కూడా ఓ లేఖను పీఆర్వోకి ఇవ్వాల్సి వుంటుంది. పీఆర్వో, గుర్తింపు కోసం ఐడీ సహా సంబంధిత డాక్యుమెంట్లను బిఎల్ఎస్ సెంటర్లలో తగిన సొమ్ము చెల్లించి అందించవచ్చు. కొత్త మరియు పాత పాస్పోర్టులను స్వయంగా స్వీకరించడానికి లేదా కొరియర్ ద్వారా పొందడానికి తగిన ఆప్షన్ని కూడా ఎంచుకోవడానికి వీలుంది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









