కువైట్: ఇంట్లోనే మద్యం తయారీ...346 లిక్కర్ బాటిల్స్ సీజ్
- November 25, 2020
కువైట్: గల్ఫ్ కంట్రీస్ లో మద్యం అమ్మకాల విషయంలో రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయన్న విషయం తెలిసిందే. అయినా..కొందరు తేలిగ్గా డబ్బు సంపాదించే అత్యాశతో జైలు పాలవుతున్నారు. అక్రమంగా లిక్కర్ బాటిల్స్ అమ్మితేనే కఠిన చర్యలు ఉంటాయి. అలాంటిది కువైట్ లోని అహ్మదీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఏకంగా అల్కాహాల్ ను సొంతంగా తయారు చేసి..అక్రమంగా అమ్ముతున్నారు. అయితే..పోలీసులు రోటీన్ గా గస్తీ డ్యూటీ చేస్తుండగా..మహ్ బౌలా ప్రాంతంలో ఓ బస్సు అనుమానస్పదంగా నిలిపి ఉంచినట్లు గమనించారు. బస్సు దగ్గరికి పోలీసులు వెళ్తుండగానే...మద్యం అమ్మకందారులు పోలీసులకు దొరక్కుండా పరిగెత్తి పారిపోయారు. దీంతో బస్సులో తనిఖీలు చేపట్టిన పోలీసులు...అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 346 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. బస్సులో వారి వేలి ముద్రలను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!







