వరదల్లో వాహనంతో సహా ఓ కుటుంబం జలసమాధి
- February 18, 2016
యు.ఎ.ఇ.లో వర్షాలు ఏకధాటిగా కురవడంతో వాగులు వంకలు లోయల నుంచి వరదనీరు పొంగి పొర్లుతుంది. రెప్పపాటులోవిరుచుకుపడిన వరదలు ఓ కుటుంబంను వాహనంతో సహా జలసమాధి చేసింది.ఈ విషాదకర సంఘటన బుధవారం రస అల్ ఖమహ్ ప్రాంతంలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో ఎమిరేట్స్ కు చెందిన ఒక తల్లి , ఆమె 11 ఏళ్ళ కుమార్తె , 3, 6 ఏళ్ళ వయస్సు ఉన్న ఇరువురు కుమారులు ఈ దుర్గటనలో మరణించారు. వీరు చనిపోయే ముందు వాహనంతో సహా ఎంతో దూరం కొట్టుకుపోయారు. కాగా వాహనం నడుపుతున్న కుటుంబ యజమానిని స్థానికులు రక్షించారు. ఈ వరద ప్రమాదంలో తల్లి , కుమార్తెల మృతదేహాలు బుధవారం లభ్యం అయ్యాయి. ఇరువురు చిన్నారుల శవాలును గురువారం ఉదయం కనుగొన్నారు. నది పరివాహక ప్రాంతం ఇసుకలో 500 మీటర్ల దూరం వాహనాన్ని నడుపుతుండగా, ఆ మార్గంలో అకస్మాత్తుగా వరద ఉదృతంగా ఎదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. నిరంతరంగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా లోయలు నిండిపోయి ఒక్కసారిగా నీరు విడుదల కాబడి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్నాయి. జారిపోయే గుణమున్న ఇటువంటి ప్రదేశాలలో ప్రయాణాలు మంచిది కాదని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్థానికుల సహాయంతో రక్షింపబడిన కుటుంబ యజమాని ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తుంది
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







