వరదల్లో వాహనంతో సహా ఓ కుటుంబం జలసమాధి
- February 18, 2016
యు.ఎ.ఇ.లో వర్షాలు ఏకధాటిగా కురవడంతో వాగులు వంకలు లోయల నుంచి వరదనీరు పొంగి పొర్లుతుంది. రెప్పపాటులోవిరుచుకుపడిన వరదలు ఓ కుటుంబంను వాహనంతో సహా జలసమాధి చేసింది.ఈ విషాదకర సంఘటన బుధవారం రస అల్ ఖమహ్ ప్రాంతంలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో ఎమిరేట్స్ కు చెందిన ఒక తల్లి , ఆమె 11 ఏళ్ళ కుమార్తె , 3, 6 ఏళ్ళ వయస్సు ఉన్న ఇరువురు కుమారులు ఈ దుర్గటనలో మరణించారు. వీరు చనిపోయే ముందు వాహనంతో సహా ఎంతో దూరం కొట్టుకుపోయారు. కాగా వాహనం నడుపుతున్న కుటుంబ యజమానిని స్థానికులు రక్షించారు. ఈ వరద ప్రమాదంలో తల్లి , కుమార్తెల మృతదేహాలు బుధవారం లభ్యం అయ్యాయి. ఇరువురు చిన్నారుల శవాలును గురువారం ఉదయం కనుగొన్నారు. నది పరివాహక ప్రాంతం ఇసుకలో 500 మీటర్ల దూరం వాహనాన్ని నడుపుతుండగా, ఆ మార్గంలో అకస్మాత్తుగా వరద ఉదృతంగా ఎదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. నిరంతరంగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా లోయలు నిండిపోయి ఒక్కసారిగా నీరు విడుదల కాబడి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్నాయి. జారిపోయే గుణమున్న ఇటువంటి ప్రదేశాలలో ప్రయాణాలు మంచిది కాదని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్థానికుల సహాయంతో రక్షింపబడిన కుటుంబ యజమాని ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తుంది
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









