భారత్లో స్పుత్నిక్ టీకా ఉత్పత్తికి అంగీకరించిన రష్యా
- November 27, 2020
మాస్కో: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం స్పుత్నిక్ -వీ టీకాను రష్యా తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ను ఇండియాలో కూడా ఉత్పత్తి చేసేందుకు రష్యా అంగీకారం తెలిపింది. భారత్కు చెందిన హెటిరో సంస్థ.. రష్యా ప్రభుత్వంతో కలిసి ఏడాదికి సుమారు 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. స్పుత్నిక్- వీ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
హెటిరో సంస్థతో పాటు రష్యన్ డైరక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)లు ప్రపంచవ్యాప్తంగా టీకాను పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియాలో స్పుత్నిక్- వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా తన ప్రకటనలో పేర్కొన్నది. ఇండియాలో ప్రస్తుతం స్పుత్నిక్ టీకాకు చెందిన రెండవ, మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా ట్రయల్స్ను పూర్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









