అర్నాబ్ గోస్వామి బెయిల్ పొడిగింపు..
- November 27, 2020
న్యూఢిల్లీ: అర్నాబ్ గోస్వామి బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించింది. గోస్వామి తాత్కాలిక బెయిల్ ను మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం తెలిపింది. ఆర్కిటెక్ట్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారనే ఆరోపణలతో నమోదైన కేసులో గోస్వామి అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకునే విధంగా గోస్వామి ప్రేరేపించినట్టు చెప్పలేమని అన్నారు. గోస్వామిపై ఉన్న ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని చెప్పారు. తన అధికారాన్ని ఉపయోగించడంలో బాంబే హైకోర్టు విఫలమైందని అన్నారు. ఏ వ్యక్తికైనా సరే ఒక్కరోజు వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం కూడా తీవ్రమైన విషయమేనని చెప్పారు. క్రిమినల్ చట్టాలు ప్రజలను వేధించే సాధనంగా మారకూడదని అన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







