ఢిల్లీ నుంచి రస్ అల్ ఖైమాలో చేరుకున్న తొలి స్పైస్ జెట్ విమానం
- November 27, 2020
రస్ అల్ ఖైమా:ఢిల్లీ నుంచి తొలి స్పైస్ జెట్ విమానం రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 27, శుక్రవారం ఉదయం ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ ద్వారా ఇండియాలోని 28 డెస్టినేషన్లకు యూఏఈతో స్పైస్ జెట్ విమానాలు కనెక్ట్ చేయనున్నాయి. ముందు ముందు మరిన్ని డెస్టినేషన్లకు విమానాల్ని ఈ సంస్థ ప్రకటించనుంది. స్పైస్ జెట్ బోయింగ్ 737-800 విమానాల్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్ట్ చేస్తోంది. కాగా, రస్ అల్ ఖైమా నుంచి సోమవారం అలాగే శుక్రవారాల్లో ఢిల్లీకి విమానాలు తిరిగి వెళతాయి. మొత్తం 189 మంది ప్రయాణీకులు ఓ విమానంలో ప్రయణించే వీలుంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









