ఢిల్లీ నుంచి రస్‌ అల్‌ ఖైమాలో చేరుకున్న తొలి స్పైస్‌ జెట్‌ విమానం

- November 27, 2020 , by Maagulf
ఢిల్లీ నుంచి రస్‌ అల్‌ ఖైమాలో చేరుకున్న తొలి స్పైస్‌ జెట్‌ విమానం

రస్‌ అల్‌ ఖైమా:ఢిల్లీ నుంచి తొలి స్పైస్‌ జెట్‌ విమానం రస్‌ అల్‌ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్‌ 27, శుక్రవారం ఉదయం ల్యాండ్‌ అయ్యింది. ఢిల్లీ ద్వారా ఇండియాలోని 28 డెస్టినేషన్లకు యూఏఈతో స్పైస్‌ జెట్‌ విమానాలు కనెక్ట్‌ చేయనున్నాయి. ముందు ముందు మరిన్ని డెస్టినేషన్లకు విమానాల్ని ఈ సంస్థ ప్రకటించనుంది. స్పైస్‌ జెట్‌ బోయింగ్‌ 737-800 విమానాల్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్‌ అల్‌ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్ట్‌ చేస్తోంది. కాగా, రస్‌ అల్‌ ఖైమా నుంచి సోమవారం అలాగే శుక్రవారాల్లో ఢిల్లీకి విమానాలు తిరిగి వెళతాయి. మొత్తం 189 మంది ప్రయాణీకులు ఓ విమానంలో ప్రయణించే వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com