ప్రధాని మోదీ...కొత్త షెడ్యూల్ ఇదే
- November 27, 2020
హైదరాబాద్:ప్రధాని మోదీ రేపటి హైదరాబాద్ టూర్ సమయం మారింది. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రావాల్సిన ప్రధాని.. ఒంటిగంటకు నగరానికి చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు ప్రధాని మోదీ. అనంతరం భారత్ బయోటెక్ చేరుకుంటారు. తిరిగి 3 గంటలకి హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి బయల్దేరుతారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాంగణం ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు గడిపే మోదీ... కరోనా వ్యాక్సీన్కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. కార్యక్రమం పూర్తయ్యాక నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు.
గ్రేటర్ ఎన్నికలతో కానీ, ప్రచారంతో కానీ మోదీకి సంబంధం లేకపోయినా... హైదరాబాద్లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా ప్రధానికి సంబంధించిన ఏ పర్యటన అయినా.. రెండువారాల ముందు ఖరావుతుంది. కానీ, ఈ టూర్ ఆకస్మికంగా ఖరారైంది. దీంతో, మోదీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సభతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్న టీఆర్ఎస్ కు కౌంటర్ గానే. ప్రధాని పర్యటనను బీజేపీ ప్లాన్ చేసి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బిజెపి అగ్రనాయకత్వం మొత్తం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా ఇప్పుడు ప్రధాని పర్యటన ఆసక్తిగా మారింది.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







