ఖతార్ లో కోవిడ్ రూల్స్ బ్రేక్..ఫేస్ మాస్క్ ధరించని 112 మంది అరెస్ట్
- November 28, 2020
దోహా:ఖతార్ లో కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఫేస్ మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 112 మందిని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి న్యాయవిచారణకు కేసును బదిలీ చేశారు. అలాగే వాహనంలో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కేసులో మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నియంత్రణ కోసం ఖతార్ ప్రభుత్వం ఒక వాహనంలో డ్రైవర్ తో సహా నలుగురికి మించి ప్రయాణించొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు ప్రభుత్వం సూచించిన నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు







