దేశంలోకి ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలను ప్రకటించనున్న కువైట్
- November 28, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్ తగినంతగా అందుబాటులోకి రాగానే దేశంలోకి ఎంట్రీ ఇచ్చే పౌరులు, ప్రవాసీయులకు కొత్త మార్గనిర్దేశకాలను సూచించేందుకు కువైట్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కువైట్ నిషేధిత జాబితాలో ఉన్న 34 దేశాల నుంచి కూడా ప్రయాణికులను అనుమతించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో...ప్రభుత్వం ప్రకటించబోయే కొత్త నిబంధనలు నిషేదించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నియంత్రించేందుకు దోహదపడుతందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత...భారత్, పాకిస్తాన్ తో సహా 34 నిషేధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, ప్రవాసీయులు తాము కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తో పాటు రెండు వారాలు క్వారంటైన్ లో ఉండేందుకు సుముఖతను చూపించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారు ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. ఇదిలాఉంటే కరోనా ప్రభావం ఎక్కువగా 34 దేశాల పట్ల కూడా గౌరవభావంతో ఉన్నామని, ఆయా దేశాల నుంచి విమాన రాకపోకలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే..ప్రస్తుతం జాతీయ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంన్నందున ఆంక్షల సడలింపు కొన్ని రోజులు ఆలస్యం కానుందని వివరించింది. ఎన్నికల ఫలితాలు రాగానే కరోనా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







