దేశంలోకి ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలను ప్రకటించనున్న కువైట్
- November 28, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్ తగినంతగా అందుబాటులోకి రాగానే దేశంలోకి ఎంట్రీ ఇచ్చే పౌరులు, ప్రవాసీయులకు కొత్త మార్గనిర్దేశకాలను సూచించేందుకు కువైట్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కువైట్ నిషేధిత జాబితాలో ఉన్న 34 దేశాల నుంచి కూడా ప్రయాణికులను అనుమతించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో...ప్రభుత్వం ప్రకటించబోయే కొత్త నిబంధనలు నిషేదించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నియంత్రించేందుకు దోహదపడుతందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత...భారత్, పాకిస్తాన్ తో సహా 34 నిషేధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, ప్రవాసీయులు తాము కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తో పాటు రెండు వారాలు క్వారంటైన్ లో ఉండేందుకు సుముఖతను చూపించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారు ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. ఇదిలాఉంటే కరోనా ప్రభావం ఎక్కువగా 34 దేశాల పట్ల కూడా గౌరవభావంతో ఉన్నామని, ఆయా దేశాల నుంచి విమాన రాకపోకలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే..ప్రస్తుతం జాతీయ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంన్నందున ఆంక్షల సడలింపు కొన్ని రోజులు ఆలస్యం కానుందని వివరించింది. ఎన్నికల ఫలితాలు రాగానే కరోనా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి
- డెలివరీ రైడర్లకు గుడ్ న్యూస్
- యువత భవితను మార్చనున్న 'వివేకానంద మానవ వికాస కేంద్రం
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్







