క్షమాభిక్ష ప్రకటించిన ఒమాన్ ప్రభుత్వం
- November 28, 2020
మస్కట్:చట్టవిరుద్ధంగా ఒమాన్ దేశంలో ఉంటున్న వారందరిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి జరిమానాలు లేకుండా ఇంటికి వెళ్ళడానికి అవకాశం కల్పించి ఇటీవల క్షమాభిక్షను ప్రకటించిన ఒమాన్ ప్రభుత్వానికి ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కుటుంబ వీసాలపై, సందర్శన వీసాలపై లేదా వర్క్ వీసాలపై వచ్చి చట్టవిరుద్ధంగా ఒమాన్ లో ఉంటున్న తెలుగు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఆయన విజ్ఙప్తి చేశారు.ఈ సందర్భంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సహరించాలని ఏ.పి, తెలంగాణ ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఒక నోడల్ ఆఫీసర్ ని ప్రత్యేకంగా నియమించి పాస్పోర్ట్ కార్యలయం అందించే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అంటే ఔట్ పాసులు జారిచేయడం లో జాప్యం లేకుండా చూడాలని తెలంగాణ,ఏ.పి ప్రభుత్వాలను కోరారు.ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలకు సహాయం చేయడానికి తగిన గుర్తింపు నిచ్చి వారి సేవలను కూడా వినియోగించుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీలయినంత వరకు ఎక్కువ విమానాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత విమాన టికెట్లను అందించి వారిని క్షేమంగా తెలుగు రాష్ట్రాలకు చేర్చాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
ఈ అవకాశం 15,నవంబర్, 2020 నుండి 31,డిసెంబర్,2020 వరకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 31 లోపల అనుమతి పొందిన వారు ఆ తర్వాత కూడా ప్రయాణించవచ్చు అని తెలిపారు.మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా దగ్గర లోని సనద్ సర్వీసెస్ లో నమోదు చేసుకోవచ్చు లేదా ఈ విషయం లో ఎవరికైనా సందేహాలున్నా లేదా ధరఖాస్తు చేసుకోవడం లో సహాయం కావాలన్న ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులైన నరేంద్ర పన్నీరు - 97837893, కుమార్ మంచికట్ల - 93767387, వేమనకుమార్ - 90831775 మరియు మురళి వడ్లపట్ల - 9770 1701లను సంప్రదించవచ్చు. మరియు టీం ముఖ్య సభ్యులైన మామిడి శ్యాం, చేని ప్రభాకర్, వంకాయాల కార్తిక్ మరియు గరిగే రమేష్, చేని గురువయ్య లు అందుబాటులో ఉంటారని నరేంద్ర పన్నీరు తెలిపారు.

తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







