క్షమాభిక్ష ప్రకటించిన ఒమాన్ ప్రభుత్వం
- November 28, 2020
మస్కట్:చట్టవిరుద్ధంగా ఒమాన్ దేశంలో ఉంటున్న వారందరిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి జరిమానాలు లేకుండా ఇంటికి వెళ్ళడానికి అవకాశం కల్పించి ఇటీవల క్షమాభిక్షను ప్రకటించిన ఒమాన్ ప్రభుత్వానికి ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కుటుంబ వీసాలపై, సందర్శన వీసాలపై లేదా వర్క్ వీసాలపై వచ్చి చట్టవిరుద్ధంగా ఒమాన్ లో ఉంటున్న తెలుగు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఆయన విజ్ఙప్తి చేశారు.ఈ సందర్భంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సహరించాలని ఏ.పి, తెలంగాణ ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఒక నోడల్ ఆఫీసర్ ని ప్రత్యేకంగా నియమించి పాస్పోర్ట్ కార్యలయం అందించే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అంటే ఔట్ పాసులు జారిచేయడం లో జాప్యం లేకుండా చూడాలని తెలంగాణ,ఏ.పి ప్రభుత్వాలను కోరారు.ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలకు సహాయం చేయడానికి తగిన గుర్తింపు నిచ్చి వారి సేవలను కూడా వినియోగించుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీలయినంత వరకు ఎక్కువ విమానాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత విమాన టికెట్లను అందించి వారిని క్షేమంగా తెలుగు రాష్ట్రాలకు చేర్చాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
ఈ అవకాశం 15,నవంబర్, 2020 నుండి 31,డిసెంబర్,2020 వరకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 31 లోపల అనుమతి పొందిన వారు ఆ తర్వాత కూడా ప్రయాణించవచ్చు అని తెలిపారు.మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా దగ్గర లోని సనద్ సర్వీసెస్ లో నమోదు చేసుకోవచ్చు లేదా ఈ విషయం లో ఎవరికైనా సందేహాలున్నా లేదా ధరఖాస్తు చేసుకోవడం లో సహాయం కావాలన్న ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులైన నరేంద్ర పన్నీరు - 97837893, కుమార్ మంచికట్ల - 93767387, వేమనకుమార్ - 90831775 మరియు మురళి వడ్లపట్ల - 9770 1701లను సంప్రదించవచ్చు. మరియు టీం ముఖ్య సభ్యులైన మామిడి శ్యాం, చేని ప్రభాకర్, వంకాయాల కార్తిక్ మరియు గరిగే రమేష్, చేని గురువయ్య లు అందుబాటులో ఉంటారని నరేంద్ర పన్నీరు తెలిపారు.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







