‘ఛలో ఢిల్లీ’ రైతు ఉద్యమంలో విషాధం…
- November 29, 2020
న్యూ ఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో విషాధం చోటు చేసుకుంది. పంజాబ్కు చెందిన జనక్ రాజ్(55) అనే రైతు కారులో నిద్రపోగా.. ఆ కారుకు నిప్పు అంటుకుని అతను సజీవ దహనం అయ్యాడు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న జనక్ రాజ్ రోజంతా రాత్రి సమయంలో అక్కడే ఉన్న కారులో నిద్రపోయాడు. అయితే కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన చుట్టుపక్కన వాళ్లు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు. దీంతో అతను కారులోనే సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల్లో పెను విషాధం నింపింది. మరోవైపు అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనక్ రాజ్ స్వస్థలం పంజాబ్లోని బర్నాల జిల్లా ధనోలువా గ్రామం అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









