యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- March 13, 2026
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం కుటుంబ సభ్యులతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఆయనకు వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.గవర్నర్ ధ్వజస్తంభం వద్ద బలిపీఠానికి నమస్కరించుకొని స్వామి వారి అంతరాలయంలో అర్చనాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వామి అమ్మవారి అష్టోత్తరంతో ప్రత్యేక పూజలు గావించి హారతిని ఇచ్చి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







