తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు

- March 13, 2026 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు

శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 37°C గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.గాలిలో తేమ 46% ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 35°C నుండి 37°C మధ్య నమోదు కానున్నాయి.గాలిలో తేమ 19% మాత్రమే కాగా, రెండు రాష్ట్రాల్లో UV ఇండెక్స్ 9 గా నమోదు కానుందని వివరించింది. ఇది ప్రమాదకర స్థాయి అని వైద్యులు అంటున్నారు. దాహం వేయకపోయినా నీరు తాగాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com