ఏపి అరుదైన రికార్డు..

- November 30, 2020 , by Maagulf
ఏపి అరుదైన రికార్డు..

అమరావతి: ఏపి కరోనా పరీక్షల నిర్దారణలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నిన్నటికి రాష్ట్రంలో కోటికి పైగా నమూనాలను పరీక్షించారు. నిన్నటివరకూ మొత్తం 1,00,17,126 మంది నమూనాలను పరీక్షించామని వైద్యాధికారులు వెల్లడించారు. తొలి కరోనా కేసు వచ్చిన వేళ, నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా లేని స్థితి నుంచి ఇప్పుడు 150 ల్యాబ్ లలో వేలాది టెస్ట్ లను చేస్తున్నామని, మరణాల రేటు దేశంలోనే అతి తక్కువగా ఉన్నది ఏపిలోనేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ పద్ధతులను పాటించడంలో ఏపిని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com