ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

- November 30, 2020 , by Maagulf
ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,68,064కి చేరింది. ఇందులో 7840 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,53,232 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 4 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,992కు చేరుకుంది. ఇక నిన్న 934 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,00,57,854 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 21, చిత్తూరు 31, తూర్పుగోదావరి 45, గుంటూరు 35, కడప 26, కృష్ణా 70, కర్నూలు 12, నెల్లూరు 19, ప్రకాశం 7, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 11, విజయనగరం 20, పశ్చిమ గోదావరి 74 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,291కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 827 మంది కరోనాతో మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com