భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- January 29, 2026
దోహా: ఇండియా ఐకానిక్ లగ్జరీ టూరిస్ట్ రైళ్లు అయిన మహారాజాస్ ఎక్స్ప్రెస్ మరియు గోల్డెన్ చారియట్లను ప్రోత్సహించడానికి జనవరి 27న భారతదేశ జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖతార్ లో రోడ్షోను నిర్వహించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరియు ఇండియన్ బిజినెస్ & ప్రొఫెషనల్స్ కౌన్సిల్ (IBPC) సహకారంతో ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం చేపట్టింది.
ఈ రోడ్షో సందర్భంగా భారత ప్రీమియం టూరిజం రైళ్ల గురించిన వివరాలను హైలైట్ చేశారు. ఈ లగ్జరీ రైళ్ల ప్రయాణాల ద్వారా భారత సాంస్కృతిక వారసత్వం, రాజ వారసత్వం మరియు ప్రపంచ స్థాయి ఆతిథ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఖతార్లోని భారత రాయబారి విపుల్ వివరించారు. విలాసవంతమైన పర్యాటక గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. IRCTC గ్రూప్ జనరల్ మేనేజర్ ప్రోమిలా గుప్తా.. రెండు లగ్జరీ రైళ్ల ప్రయాణ ప్రణాళికలు, ఆన్బోర్డ్ సౌకర్యాలు, సేవలపై వివరణాత్మక ప్రజంటేషన్ ఇచ్చారు. రోడ్షోలో ప్రముఖ టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ మరియు టూరిజం నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







