భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- January 29, 2026
దోహా: ఇండియా ఐకానిక్ లగ్జరీ టూరిస్ట్ రైళ్లు అయిన మహారాజాస్ ఎక్స్ప్రెస్ మరియు గోల్డెన్ చారియట్లను ప్రోత్సహించడానికి జనవరి 27న భారతదేశ జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖతార్ లో రోడ్షోను నిర్వహించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరియు ఇండియన్ బిజినెస్ & ప్రొఫెషనల్స్ కౌన్సిల్ (IBPC) సహకారంతో ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం చేపట్టింది.
ఈ రోడ్షో సందర్భంగా భారత ప్రీమియం టూరిజం రైళ్ల గురించిన వివరాలను హైలైట్ చేశారు. ఈ లగ్జరీ రైళ్ల ప్రయాణాల ద్వారా భారత సాంస్కృతిక వారసత్వం, రాజ వారసత్వం మరియు ప్రపంచ స్థాయి ఆతిథ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఖతార్లోని భారత రాయబారి విపుల్ వివరించారు. విలాసవంతమైన పర్యాటక గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. IRCTC గ్రూప్ జనరల్ మేనేజర్ ప్రోమిలా గుప్తా.. రెండు లగ్జరీ రైళ్ల ప్రయాణ ప్రణాళికలు, ఆన్బోర్డ్ సౌకర్యాలు, సేవలపై వివరణాత్మక ప్రజంటేషన్ ఇచ్చారు. రోడ్షోలో ప్రముఖ టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ మరియు టూరిజం నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









