ఖతార్ లో కరోనా తీవ్రత..24 గంటల్లో 255 కేసులు నమోదు..ఒకరు మృతి

- December 02, 2020 , by Maagulf
ఖతార్ లో కరోనా తీవ్రత..24 గంటల్లో 255 కేసులు నమోదు..ఒకరు మృతి

దోహా:ఖతార్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 255 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఓవరాల్ గా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన వారి సంఖ్య 1,39,256కు పెరిగింది. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 57 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఇప్పటివరకు 239 మంది మృతి చెందారు. ఇక గత 24 గంటల్లో 207 మంది రికవరీ అయినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒవరాల్ గా 1,36,513 మంది కరోనా నుంచి కోలుకోగా..ప్రస్తుతం 2,504 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 206 మందివి కమ్యూనిటీ కేసులు ఉన్నాయి. మిగిలిన 49 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారని అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com