అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించిన ప్రీతి తాతంభోట్ల
- February 18, 2016
కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ శోభా నాయుడు గారి వద్ద శిష్యరికం చేసి , "తన్మయి" అనే ఆర్ట్ స్టూడియో ను దుబాయ్ లో స్థాపించి, కూచిపూడి లో నృత్య శిక్షణ అందిస్తున్నారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల .
ఇటీవల కాలంలో శిల్పారామం లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు ప్రీతి.
"మామవతు శ్రీ సరస్వతి" అనే సరస్వతి దేవి ప్రార్థన తో ప్రదర్శన ప్రారంభించారు. ఆ తరువాత అన్నమాచార్య కీర్తన, 'మంగాంబుధి హనుమంత' అనే అంశాన్ని ప్రదర్శించారు ప్రీతి . ఈ అంశంలో ప్రీతి, భక్తి పారవశ్యం తో హనుమంతుని కొలుస్తూ నర్తించింది . ఖండిత నాయిక లక్షణాలుగల "వాని పొందు చాలు వద్దనే" అనే జావలి ని ప్రదర్శించి, ప్రేక్షకులను తన అభినయ చాతుర్యంతో మంత్రముగ్ధులను చేసింది శ్రీమతి ప్రీతి తాతంభోట్ల.
హైదరాబాద్ లోని "Hitex Convention Centre" లో ఇటివల జరిగన ఒక అంతర్జాతీయ సదస్సు లో మరో ప్రదర్శన కూడా ఇచ్హారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల.


తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







