అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించిన ప్రీతి తాతంభోట్ల

- February 18, 2016 , by Maagulf

కూచిపూడి నృత్యకారిణి  పద్మశ్రీ శోభా నాయుడు గారి  వద్ద శిష్యరికం చేసి , "తన్మయి" అనే  ఆర్ట్ స్టూడియో ను దుబాయ్ లో  స్థాపించి, కూచిపూడి లో నృత్య శిక్షణ అందిస్తున్నారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల . 

ఇటీవల  కాలంలో శిల్పారామం లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు ప్రీతి. 

"మామవతు శ్రీ సరస్వతి" అనే  సరస్వతి దేవి ప్రార్థన తో ప్రదర్శన ప్రారంభించారు.  ఆ తరువాత అన్నమాచార్య కీర్తన, 'మంగాంబుధి హనుమంత' అనే  అంశాన్ని ప్రదర్శించారు ప్రీతి . ఈ అంశంలో ప్రీతి, భక్తి పారవశ్యం తో హనుమంతుని కొలుస్తూ నర్తించింది . ఖండిత నాయిక లక్షణాలుగల "వాని పొందు  చాలు వద్దనే" అనే జావలి ని  ప్రదర్శించి, ప్రేక్షకులను తన అభినయ చాతుర్యంతో మంత్రముగ్ధులను చేసింది శ్రీమతి ప్రీతి  తాతంభోట్ల.  

హైదరాబాద్  లోని  "Hitex Convention Centre" లో ఇటివల జరిగన ఒక అంతర్జాతీయ సదస్సు లో మరో ప్రదర్శన కూడా   ఇచ్హారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com