బిగ్ టికెట్ అబుధాబి: 12 మిలియన్ దిర్హాములు గెల్చుకున్న భారతీయుడు
- December 04, 2020యూఏఈ:దుబాయ్కి చెందిన భారత వలసదారుడు 12 మిలియన్ దిర్హాముల బహుమతిని గెల్చుకున్నాడు బిగ్ టికెట్ డ్రా సందర్భంగా. అబుధాబిలో జరిగిన 222 సిరీస్ బిగ్ టికెట్ డ్రా, భారత వలసదారుడికి అత్యద్భుతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. 51 ఏళ్ళ జార్జి జాకబ్స్, మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వున్న జార్జికి ఈ బిగ్ టికెట్ డ్రాతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. దుబాయ్లో ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. నవంబర్ 30న జార్జి, 069402 టిక్కెట్ని కొనుగోలు చేశారు. గత రెండేళ్ళుగా ఆయన ఈ టిక్కెట్లను కొంటున్నారు. కాగా, గెలిచిన మొత్తాన్ని ఎవరితోనూ తాను పంచుకోబోనని జార్జి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం