బిగ్ టికెట్ అబుధాబి: 12 మిలియన్ దిర్హాములు గెల్చుకున్న భారతీయుడు
- December 04, 2020
యూఏఈ:దుబాయ్కి చెందిన భారత వలసదారుడు 12 మిలియన్ దిర్హాముల బహుమతిని గెల్చుకున్నాడు బిగ్ టికెట్ డ్రా సందర్భంగా. అబుధాబిలో జరిగిన 222 సిరీస్ బిగ్ టికెట్ డ్రా, భారత వలసదారుడికి అత్యద్భుతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. 51 ఏళ్ళ జార్జి జాకబ్స్, మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వున్న జార్జికి ఈ బిగ్ టికెట్ డ్రాతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. దుబాయ్లో ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. నవంబర్ 30న జార్జి, 069402 టిక్కెట్ని కొనుగోలు చేశారు. గత రెండేళ్ళుగా ఆయన ఈ టిక్కెట్లను కొంటున్నారు. కాగా, గెలిచిన మొత్తాన్ని ఎవరితోనూ తాను పంచుకోబోనని జార్జి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







