బిగ్ టికెట్ అబుధాబి: 12 మిలియన్ దిర్హాములు గెల్చుకున్న భారతీయుడు
- December 04, 2020యూఏఈ:దుబాయ్కి చెందిన భారత వలసదారుడు 12 మిలియన్ దిర్హాముల బహుమతిని గెల్చుకున్నాడు బిగ్ టికెట్ డ్రా సందర్భంగా. అబుధాబిలో జరిగిన 222 సిరీస్ బిగ్ టికెట్ డ్రా, భారత వలసదారుడికి అత్యద్భుతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. 51 ఏళ్ళ జార్జి జాకబ్స్, మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వున్న జార్జికి ఈ బిగ్ టికెట్ డ్రాతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. దుబాయ్లో ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. నవంబర్ 30న జార్జి, 069402 టిక్కెట్ని కొనుగోలు చేశారు. గత రెండేళ్ళుగా ఆయన ఈ టిక్కెట్లను కొంటున్నారు. కాగా, గెలిచిన మొత్తాన్ని ఎవరితోనూ తాను పంచుకోబోనని జార్జి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు