థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి1న ‘ఒరేయ్‌ బుజ్జిగా...`

- December 04, 2020 , by Maagulf
థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి1న ‘ఒరేయ్‌ బుజ్జిగా...`

హైదరాబాద్:యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా  లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...`. ఈ చిత్రం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న థియేట‌ర్‌ల‌లో  విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``2021కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మా బేన‌ర్‌లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం`` అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్  త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com