మహానటి సావిత్రి 85వ జయంతి సందర్భంగా మహానటి పాటలకు పట్టాభిషేకం
- December 05, 2020
వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, శారదా కళాసమితి ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 17 అంతర్జాతీయ తెలుగు సంస్థల అభినందనలతో డిసెంబర్ 6వ తేదీ ఉదయం 11 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకు అంటే 12 గంటలపాటు నిర్విరామంగా 5 ఖండాలలోని 8 దేశాలలోని 30 మంది గాయనీ గాయకులు మహానటి సావిత్రి నటించిన చిత్రాలనుంచి ఆణిముత్యాలవంటి 100 పాటలతో ‘మహానటి పాటలకు పట్టాభిషేకం’ చేయనున్నారు. మహానటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించే ఈ కార్యక్రమం ప్రజానటి, కళాభారతి డా॥ జమునా రమణారావు, మండలి బుద్ధప్రసాద్ (పూర్వ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ), ఎమ్. మురళీమోహన్, సినీనటులు, నిర్మాత, పార్లమెంట్ పూర్వ సభ్యులు, రేలంగి నరసింహారావు, సినీ దర్శకులు, రోజారమణి, సినీనటి, కవిత సినీనటి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
గాయనీగాయకులుగా లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు (గుంటూరు), చంద్రతేజ (హైదరాబాద్), కె. వెంకట్రావు (హైదరాబాద్), రాజేంద్రప్రసాద్ (వైజాగ్), చింతలపాటి సురేష్ (హైదరాబాద్), సురేఖామూర్తి దివాకర్ల (హైదరాబాద్), వి.కె. దుర్గ (హైదరాబాద్), వేదుల శశికళాస్వామి (హైదరాబాద్), బి.వి.ఎన్.ఎల్. పద్మావతి (హైదరాబాద్), అఖిల (హైదరాబాద్), చిత్తరువు లక్ష్మి పద్మజ (హైదరాబాద్), అనూరాధ (హైదరాబాద్), హిమబిందు (హైదరాబాద్), కె. భాగ్యలక్ష్మి (వైజాగ్), శ్రీనివాసు కిశోర్ భరద్వాజ (అమెరికా), కుమార్ రాణి (అమెరికా), రాధికానోరి (అమెరికా), లలితారాణి (అమెరికా), శాంతి ఇప్పనపల్లి (అమెరికా), శ్రీనివాసరావు నందగిరి (న్యూజిలాండ్), శ్రీసుత నాంపల్లి (న్యూజిలాండ్), రవి కంచిబొట్ల (ఆస్ట్రేలియా), నీరజ విష్ణుభొట్ల (ఆస్ట్రేలియా) ప్రియాంక మార్గాని (ఆస్ట్రేలియా), ఉష చివుకుల (ఆస్ట్రేలియా), రూపాశాస్త్రి (హాంకాంగ్), కీర్తిక మంగు (దక్షిణాఫ్రికా), విష్ణుప్రియ (స్వీడన్), రాధిక నడదూర్ (సింగపూర్) తమ గానాన్ని వినపించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని కళాబ్రహ్మ, శిరోమణి వంశీ రామరాజు వ్యవస్థాపకులు, వంశీ సంస్థ, డా॥ తెన్నేటి సుధాదేవి, అధ్యక్షురాలు వంశీ, డా॥ వి.పి. కిల్లీ, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, డోగిపర్తి శంకరరావు, అధ్యక్షులు శారదా కళాసమితి, సురేఖామూర్తి దివాకర్ల, శైలజ సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ వంశీ, వ్యాఖ్యాన శిరోమణి సుధామయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







