ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం...
- December 05, 2020
హైదరాబాద్:ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు, డబ్బుల కోసం ఛీటింగ్లు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఘటన బయటపడింది. ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 850 మంది నుండి ఓ ఆన్ లైన్ ట్రేడింగ్ మోసగాడు ఏకంగా 34 కోట్లు వసూలు చేసాడు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డాడు. ట్రేడింగ్ పేరుతో తనను మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని... బేగంపేటకు చెందిన ఖయ్యూమ్ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు 3 నెలల క్రితం ఫిర్యాదు చేసాడు. ఆ ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు సైబర్ పోలీసులు. మోసాలకు పాల్పడుతున్న సైనిక్ పూర్ కి చెందిన కౌశిక్ బెనర్జి, రేఖ జాదవ్,అనే ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







