ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం...
- December 05, 2020
హైదరాబాద్:ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు, డబ్బుల కోసం ఛీటింగ్లు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఘటన బయటపడింది. ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 850 మంది నుండి ఓ ఆన్ లైన్ ట్రేడింగ్ మోసగాడు ఏకంగా 34 కోట్లు వసూలు చేసాడు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డాడు. ట్రేడింగ్ పేరుతో తనను మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని... బేగంపేటకు చెందిన ఖయ్యూమ్ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు 3 నెలల క్రితం ఫిర్యాదు చేసాడు. ఆ ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు సైబర్ పోలీసులు. మోసాలకు పాల్పడుతున్న సైనిక్ పూర్ కి చెందిన కౌశిక్ బెనర్జి, రేఖ జాదవ్,అనే ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







