ఏలూరును వణికిస్తున్న అంతుపట్టని వ్యాధి..పిట్టల్లా పడిపోతున్న జనాలు..
- December 06, 2020పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో భయానక పరిస్థితి నెలకొంది. ఉన్నట్లుండి నోటి వెంట నురగలు కక్కుతూ చిన్నారులు, యువకులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఏలూరులోని పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట, వంగాయగూడెం, కొబ్బరితోట ప్రాంతాల్లో బాధితులు అత్యధికంగా మూర్చతో పడిపోతున్నారు. ఇలా స్థానికులందరూ ఒక్కొక్కరుగా దాదాపు 140 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ఏలూరు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
కాగా, గత మూడు రోజులుగా తాగునీరు రంగు మారి వస్తుందని బాధితులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని బోరున విలపిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరినవారెవరికీ ప్రాణాపాయం లేదని డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ వెల్లడించారు. చికిత్స అనంతరం కోలుకుతున్న బాధితుల్లో కొందరిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంతమంది అస్వస్థతకు గురవడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి