కరోనా నుండి వేగవంతంగా కోలుకున్న దేశంగా యూఏఈ ఉండనుంది: దుబాయ్ కింగ్

- December 06, 2020 , by Maagulf
కరోనా నుండి వేగవంతంగా కోలుకున్న దేశంగా యూఏఈ ఉండనుంది: దుబాయ్ కింగ్

దుబాయ్: కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి టెక్నాలజీ ప్రియులను ఏటేటా ఆకర్షించే ఎక్సిబిషన్ 'జిటెక్స్ టెక్నాలజీ వీక్' నేడు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హందాన్ చేతులమీదుగా ప్రారంభించబడింది. 

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌తో జరిగిన సమావేశంలో దుబాయ్ రాజు 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' మాట్లాడుతూ "ప్రపంచంలో కరోనావైరస్ మహమ్మారి నుండి కోలుకునే  అత్యంత వేగవంతమైన దేశంగా యూఏఈ ఉంటుంది. 2020 కు గాను, నేడు ప్రారంభమైన జిటెక్స్ అన్ని జాగ్రత్తల నడుమ వ్యక్తిగతంగా జరుగుతున్న మొదటి ప్రధాన ఎక్సిబిషన్ గా నిలువనుంది. 2021 ను వరుస ప్రాజెక్టులు మరియు ప్రధాన కార్యక్రమాలతో ప్రారంభిస్తాము" అని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com