అమెరికా వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను బురిడీ..
- December 07, 2020
అమెరికా:అమెరికాలో H1 వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను కిలాడీ జంట నట్టేట ముంచింది. అమెరికాలో చదువుకుంటున్న F1 వీసా కలిగి ఉన్న స్టూడెంట్స్ కి H1 వీసా లు ఇప్పిస్తానని ముత్యాల సునీల్, ప్రణీతలు కోట్లు వసూలు చేశారు. 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర 10 కోట్ల వరకు వసూళ్లు చేసినట్టు సమాచారం. ఒక్కో విద్యార్థి దగ్గర 25 వేల డాలర్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు. దీంతో అట్లాంటా హోం ల్యాండ్ సెక్యూరిటీలో 30 మంది తెలుగు విద్యార్థులు వారి మీద ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ముత్యాల సునీల్, ప్రణీత పైన ఇంటర్పోల్ నోటీసులు జారీ అయ్యాయి. అలానే ఇంటర్పోల్ ముత్యాల సునీల్ , ప్రణీత పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి సునీల్ , ప్రణీతలు పరారీలో ఉన్నారు. విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ ఎకౌంట్ కు బదిలీ చేసినట్టు గుర్తించారు ఇంటర్ పోల్ అధికారులు. ఈ డబ్బుతో సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడ పెట్టినట్టు చెబుతున్నారు. సునీల్ , ప్రణీత యూరప్ పారిపోయినట్టు అనుమానాలు వ్యక్తం అవుతోండగా వెస్ట్ గోదావరి జిలాలో ఉండాల్సిన సునీల్ తండ్రి సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







