ఆన్లైన్లో అభ్యంతరకర వ్యాఖ్యలకు జైలు, 20,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా
- December 07, 2020
మనామా:బహ్రెయిన్ పార్లమెంట్ కమిటీ, ఆన్లైన్ వేదికగా ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసే అభ్యంతకర వ్యాఖ్యలు, ఆరోపణల్ని నేరపూరితంగా పరిగణించే డ్రాఫ్ట్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ ఈ మేరకు కఠినమైన పెనాల్టీలను ప్రతిపాదించడం జరిగింది. ప్యానెల్ రికమండేషన్స్ని బట్టి చూస్తే, ఆన్లైన్ ద్వారా అభ్యంతకర ఆరోపణలు చేసేవారికి జైలు శిక్ష అలాగే అత్యధికంగా 20,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు, బహ్రెయిన్ చట్టం నెంబర్ 60 - 2014కి అదనంగా చేర్చబడుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి సంబంధించిన చట్టంగా దీన్ని పరిగణిస్తారు. కింగ్డమ్ లెజిస్లేచర్ దీన్ని ఆమోదించాల్సి వుంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









