ఫైన్ లేకుండా ఒమన్ వదిలివెళ్లనున్న 2000 మంది ఇండియన్స్
- December 08, 2020
వర్క్ పర్మిట్ గడువు ముగిసిన దాదాపు 2000 మంది భారతీయులు ఒమన్ విడిచి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
వారిలో సరైన పాస్ పోర్ట్ లేని 500 మందికి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్లను కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వర్క్ పర్మిట్ ముగిసిన వారు శాశ్వతంగా ఒమన్ విడిచి వెళ్లేందుకు వీలుగా..డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 లోగా దేశం విడిచి వెళ్తే..ఎలాంటి ఫైన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో సరైన అనుమతులు లేని వారు క్షమాభిక్ష గడువును సద్వినియోగం చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది. అటు భారత ప్రభుత్వం కూడా ఈసీ జారీ కోసం ఫీజు మినహాయింపులు ఇస్తోందని, రిజిస్టర్ చేసుకున్నవారికి కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాగానే ఈసీ కోసం పాస్ పోర్టు/వీసా జారీ చేసే ఏదైనా బీఎల్ఎస్ సెంటర్ లో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









