యూఏఈ, సౌదీ లో మొట్టమొదటిసారిగా పర్యటించనున్న భారత్ సైన్యాధిపతి
- December 08, 2020
న్యూఢిల్లీ : భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా పర్యటనకు మంగళవారం బయల్దేరారు. డిసెంబరు 9 నుంచి 14 వరకు జరిగే ఈ పర్యటనలో ఈ దేశాల సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. భారత సైన్యం అధిపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
జనరల్ నరవనే ఈ నెల 9 నుంచి 10 వరకు యూఏఈలో పర్యటిస్తారు. భారత్-యూఏఈ మధ్య రక్షణ రంగంలో సంబంధాలను పెంచుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరుపుతారు. ఈ నెల 13, 14 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటిస్తారు. భారత్-సౌదీ అరేబియా మధ్య రక్షణ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై చర్చిస్తారు. రక్షణ సంబంధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం, జాయింట్ ఫోర్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం, కింగ్ అబ్దులజీజ్ వార్ కాలేజ్లను సందర్శిస్తారు. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!







