KD22కే పీసీఆర్ టెస్ట్..ప్రయాణికులకు అల్ జజీరా ఎయిర్ వేస్ ఆఫర్
- December 08, 2020
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా...విమాన ప్రయాణికులకు పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చేశాయి విమానసంస్థలు. అయితే..ఫ్లైట్ టైంకి నిర్ణీత సమయంలోగా పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత మేర ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోంది. అయితే...అల్ జజీరా ఎయిర్ వేస్ తమ ప్రయాణికులకు కోసం సులభమైన, చౌకైన ఆఫర్ ప్రకటించింది. తమ ప్రయాణికులకు కేవలం 22 కువైట్ దినార్లతో పీసీఆర్ టెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన జర్మన్ స్పెషలైజ్డ్ క్లినిక్ తో భాగస్వామ్యం అయినట్లు వివరించింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలనుకునే ప్రయాణికులు అపాయింట్మెంట్ ను ఫ్లైట్ టైంకి తగినట్లుగా షెడ్యూల్ చేసుకోవచ్చు. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు సరసమైన ఛార్జీలతో టెస్ట్ సౌలభ్యాన్ని కల్పించటం పట్ల సంతోషిస్తున్నామని అల్ జజీరా ఎయిర్ వేస్ సీఈవో రోహిత్ రామచంద్రన్ అన్నారు. ఇది చాలా మంది ప్రయాణికులకు సులభమైన ప్రయాణికి ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఫ్లైట్ టికెట్లతో పాటు పీసీఆర్ టెస్ట్ స్లాట్స్ ను http://jazeeraairways.com ద్వారాగానీ, జజీరా యాప్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 177కి కాల్ చేసి బుక్ చేసుకోవాలని రోహిత్ వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!







