అబుధాబి:జనవరి 2 నుంచి టోల్ గేట్ ఫీజు అమలు
- December 08, 2020
అబుధాబి:అబుధాబిలో బ్రిడ్జి లపై జనవరి 2 నుంచి టోల్ గేట్ ఫీజు అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులు అంతా తమ టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొని యాక్టివేట్ చేయించుకోవాలని అబుధాబి అధికారులు వెల్లడించారు. https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని సూచించారు. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు. వాహనదారులు టోల్ గేట్ దాటిన ప్రతిసారి నిర్ణయించిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే...అబుధాబిలోని నాలుగు వంతెనలపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో మాత్రమే డర్బ్ విధానం అమలులో ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు డర్బ్ యాక్టివేట్ అవుతుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







