అబుధాబి:జనవరి 2 నుంచి టోల్ గేట్ ఫీజు అమలు
- December 08, 2020
అబుధాబి:అబుధాబిలో బ్రిడ్జి లపై జనవరి 2 నుంచి టోల్ గేట్ ఫీజు అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులు అంతా తమ టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొని యాక్టివేట్ చేయించుకోవాలని అబుధాబి అధికారులు వెల్లడించారు. https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని సూచించారు. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు. వాహనదారులు టోల్ గేట్ దాటిన ప్రతిసారి నిర్ణయించిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే...అబుధాబిలోని నాలుగు వంతెనలపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో మాత్రమే డర్బ్ విధానం అమలులో ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు డర్బ్ యాక్టివేట్ అవుతుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









