ఖతార్‌లో కొత్తగా ఓ కోవిడ్‌ మరణం నమోదు

- December 09, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా ఓ కోవిడ్‌ మరణం నమోదు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో కొత్తగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో 150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు కరోనా కారణంగా మరణించారు. 173 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కరోనా నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 137,881కి చేరింది. కొత్తగా నమోదైన 150 కేసుల్లో 66 మంది ట్రావెలర్స్‌ కాగా, మిగతావి కమ్యూనిటీ కేసులు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 140,353. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో మొత్తం 4,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com